కొల్చారం (నల్గొండ జిల్లా) : తనకున్న రెండెకరాల భూమిని సాగులోకి తేవాలని అప్పు చేసి రెండు బోర్లు వేసినా చుక్క నీరు పడకపోగా.. ఆరుతడి పంటలు వేసైనా బోర్ల కోసం తెచ్చిన అప్పు తీర్చాలనుకున్న ఆ రైతుకు కాలం కలిసి రాకపోవడంతో చావే శరణ్యమైంది. దీంతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. ఈ ఘటన కొల్చారం మండలం సంగాయిపేట గిరిజన తండాలో గురువారం వెలుగుచూసింది. బాధిత కుటుంబీకుని భార్య చెమ్లి, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన రైతు లంబాడి విఠల్(46) తండాకు సమీపంలో రెండెకరాల పొలం ఉంది. కొన్నేళ్ళుగా వర్షాధారంతోనే పంట సాగు చేస్తూ వచ్చాడు. కాగా గత రెండేళ్ళుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భూమి బీడుగా ఉంటూ వచ్చింది. దీంతో ఎలాగైనా భూమిని సాగులోకి తేవాలనుకున్న విఠల్ బ్యాంక్ ద్వారా, ఇతర ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పుగా డబ్బులు తీసుకువచ్చి రెండు బోర్లు వేసినట్లు తెలిపారు. బోర్లు వేసినా నీరు పడకపోవడంతో అటు సాగులోకి భూమి రాక తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కనిపించకుండాపోయింది.
మరోవైపు రుణమాఫీకి సంబంధించిన డబ్బుల కోసం గత రెండు రోజుల నుంచి స్థానిక రంగంపేట ఎస్బిహెచ్ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ బ్యాంక్ రుణం పూర్తిగా రెన్యువల్ చేస్తే మాఫీ డబ్బులు ఇస్తామని చెప్పడంతో విఠల్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. ఆరుతడి పంటకింద వేసిన మొక్కజొన్న సైతం వర్షాలు కురవక ఎండుముఖం పడుతుండడంతో ఇక అప్పులు తీర్చేమార్గం కనిపించకపోవడంతో గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 5గంటల ప్రాంతంలో పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి పొలానికి కొద్ది దూరంలో వేపచెట్టుకు ఉరివేసుకున్నాడు. విఠల్కు దాదాపు 3లక్షల వరకు బ్యాంక్, ప్రైవేటు అప్పులు ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబీకులు కొల్చారం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు విఠల్కు ఇద్దరు కుమారులు శ్రీను, కిషన్ ఉన్నారు.
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
Published Thu, Sep 3 2015 4:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement