తెప్పపై బైక్‌.. టికెట్‌ రూ.100

Facing serious difficulties with Musi River flowing - Sakshi

అర్వపల్లి: సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం–వంగమర్తి మధ్య మూసీనది కిలోమీటర్‌ మేర ప్రవహిస్తుంది. అయితే వర్షాలు రాని సమయాల్లో నదిలో నుంచి ఇసుకలోనే ఆ గ్రామాల మధ్య రాకపోకలు సాగిస్తారు.

ఇప్పుడు మూసీనది ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో స్థానికులు కొందరు తెప్పలు ఏర్పాటు చేసి నది అవతలి ఇవతలి వైపునకు ప్రయాణికులను దాటిస్తున్నారు. ఒక బైక్‌ను తెప్పపై తీసుకెళ్తే రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top