ఇందూరు: జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ బాబు ఎలాంటి వాడో అని ఎవరినీ అడిగినా అమ్మో... ఆయనా... ఎలాంటి అక్రమాలను ప్రోత్సహించడు... అక్రమాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టడు.. విధుల్లో, పాలనలో నిక్కచ్చిగా వ్యహరిస్తాడు అని టక్కున చెప్పేస్తారు. జిల్లాలో ఇలాంటి పేరును సంపాదించున్న డీపీఓ ప్రస్తుతం నిజామాబాద్ డీఎల్పీఓ శ్రీకాంత్ అక్రమాలకు పాల్పడ్డాడని, నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ నిర్మాణాల అనుమతులకు భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డట్టు సాక్ష్యాలున్నా, ఫిర్యాదులు వచ్చినా ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు.
నిజామాబాద్ మండలం గూపన్పల్లి గ్రామ పంచాయతీ ఫేస్-2 లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నా అపార్ట్మెంట్ను కూల్చి వేయాలని డీపీఓనే గతంలో డీఎల్పీఓ ద్వారా సంబంధిత గ్రామ కార్యదర్శికి, అపార్ట్మెంట్ నిర్మాణ యజమానికి నోటీసులు జారీ చేయించారు. కాని డీఎల్పీఓ వారితో కుమ్మక్కై అపార్ట్మెంట్ నిర్మాణానికి ప్రోత్సాహం ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఎందుకంటే అపార్ట్మెంట్ నిర్మాణం ప్రారంభ దశలో ఉన్న సమయంలో అక్రమ కట్టడాలపై గ్రామస్తుడు ఫిర్యాదు చేయడంతో నోటీసు జారీ చేయగా పని నిలిపివేసినట్లు రికార్డుల్లో రాసినట్లుగా తెలిసింది. కానీ ప్రస్తుతం ఆ అపార్ట్మెంట్ నిర్మాణం చివరి దశలో ఉందంటే డీఎల్పీఓ, పంచాయతీ కార్యదర్శులిద్దరూ యజమానికి లొంగిపోయారనే విమర్శలు వస్తున్నాయి.
ఇటు అక్రమ కట్టడమేనని తెలిసిన డీపీఓ కూడా ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకపోవడంతో డీఎల్పీఓ అపార్ట్మెంట్ల నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతిలిచ్చి అందినకాడికి దండుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. డీఎల్పీఓపై వచ్చిన ఆరోపణలపై తనకు మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని మూడు రోజుల క్రితం జిల్లా పంచాయతీ అధికారి సురేశ్బాబును కలెక్టర్ ఆదేశించారు. కాని నేటి వరకు డీఎల్పీఓపై నివేదిక తయారు చేసి కలెక్టర్కు అందజేయలేదు.
అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునే డీపీఓ వెనకగుడు వేయడం వెనుక ఆంతర్యమేముందోనని పంచాయతీ అధికారులు, ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు సర్వత్రా చర్చించుకుంటున్నారు. అక్రమార్కుడికి అండగా నిలబడటం సరికాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై డీపీఓ సురేశ్బాబును వివరణ కోరగా అసలు కలెక్టర్ తమను డీఎల్పీఓపై నివేదిక ఇవ్వమని ఆదేశాలిచ్చిన విషయం తెలియదని చెప్పారు. గూపన్పల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్ను నిలిపివేయాలని నోటీసు ద్వారా తెలిపామని, ప్రస్తుతం పనులు నిలిచిపోయానని తెలిపారు. కానీ నిజానికి అక్కడ పనులు కొనసాగుతున్నాయి.
తెరపైకి మరో అక్రమాల కథ!
నిజామాబాద్ డీఎల్పీఓ అక్రమాల్లో మరో విషయం బయటకు పొక్కింది. రెండు నెలల క్రితం బాల్కొండ మండలం ముప్కాల్ గ్రామంలో ఓ ప్రజా ప్రతినిధి షాపింగ్ కాంప్లెక్స్, కల్యాణ మండపం నిర్మించడానికి గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే అనుమతి రావాలంటే ముందుగా జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి నుంచి, అలాగే ఫైర్ శాఖ అధికారుల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్( ఎన్ఓసీ) ఇవ్వాలి.
కానీ పై రెండు శాఖల అధికారుల నుంచి అనుమతి లేకుండానే పంచాయతీ కార్యదర్శి లక్పతి పంచాయతీ నుంచి అనుమతినిచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు గ్రామస్తులు డీపీఓకు ఫిర్యాదు చేయగా ముప్కాల్ కార్యదర్శిపై విచారణ చేసి నివేదిక అందజేయాలని డీఎల్పీఓను ఆదేశించాడు. విచారణకు వెళ్లిన డీఎల్పీఓ కార్యదర్శితో, నిర్మించే ప్రజా ప్రతినిధితో కుమ్మక్కై సరైన అధారాలు లేవని తప్పుడు నివేదికను డీపీఓకు ఇచ్చాడు. ఆధారాలు లేవనే ఉద్దేశంతో డీపీఓ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం గ్రామస్తులు డీపీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం లభించడం లేదు.
సాక్ష్యాలున్నా.. మౌనమేల ?
Published Fri, Nov 14 2014 4:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement