ఎంసెట్‌ టెండర్లలో అక్రమాలు: కొనగల | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ టెండర్లలో అక్రమాలు: కొనగల

Published Wed, Feb 22 2017 2:51 AM

EAMCET Management  irregularities in public tenders konagala Mahesh

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ నిర్వహణ పనులను బహిరంగ టెండర్లు పిలవకుండానే మాగ్నెటిక్‌ ఇన్ఫోటెక్‌ సంస్థకు ప్రభుత్వం అప్పగించిందని, దీనిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేశ్‌ ఆరోపించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో అసమర్థంగా, అవకతవకలతో ఎంసెట్‌ను నిర్వహించిన మాగ్నెటిక్‌ కంపెనీకే ఉన్నత విద్యామండలి బాధ్యతలు అప్పగించిందన్నారు. ఎంసెట్‌ లీకేజీ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి జైలులో ఉండేవార న్నారు. మంత్రి కేటీఆర్‌ జోక్యంతోనే అక్రమాలు జరిగాయని ఆరోపించారు

Advertisement

తప్పక చదవండి

Advertisement