‘ట్రంప్‌’ వీరాభిమాని

Donald Trump's fan krishna - Sakshi

ఏడాదిగా అమెరికా అధ్యక్షుడికి పూజలు

జనగామ: భారత్, అమెరికా దేశాల నడుమ సంబంధాలు మరింత మెరుగుపడాలని ఓ యువకుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ను తన ఆరాధ్య దైవంగా పూజిస్తున్నాడు. ఏడాదిగా చేస్తున్న పూజలు, జలం, రక్తాభిషేకాలు అభిమాన నేత మనసును కదిలించాయి. దీంతో ‘క్రిష్‌’ నా ప్రాణ స్నేహితుడంటూ స్వయంగా ట్రంప్‌ తన ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో ఆ యువకుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్సా సావిత్రి, రాము లు దంపతుల కుమారుడు కృష్ణ ట్రంప్‌కు వీరాభిమాని. గతేడాది దీపావళి నాడు ఆయన తన ఇంట్లో ట్రంప్‌ చిత్రపటానికి పూజలు చేస్తూ అభిమానాన్ని చాటుకున్నాడు. త్వరలోనే తన ఇంట్లో ట్రంప్‌ ఆలయాన్ని నిర్మించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నానని కృష్ణ చెప్పాడు.

ట్రంప్‌ ట్వీట్‌..
‘వంద కోట్ల భారతీయుల్లో క్రిష్‌ నా ప్రాణస్నేహితుడు. క్రిష్‌ నా అభిమాని. అతను నా ఫొటో ల ద్వారా గొప్పశక్తిని పొందాలని ప్రార్థిస్తున్నా. క్రిష్‌ను త్వరలోనే కలుస్తానంటూ ట్రంప్‌ తన ట్విట్టర్‌లో ఈనెల 19న పోస్టు చేశాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top