శని త్రయోదశిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో సుప్రసిద్ధ కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయానికి శనివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
కాళేశ్వర క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
Feb 20 2016 1:27 PM | Updated on Sep 3 2017 6:03 PM
కాళేశ్వరం: శని త్రయోదశిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో సుప్రసిద్ధ కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయానికి శనివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలోని శనీశ్వరుడికి పూజలు నిర్వహించారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాల, సర్ప దోష నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 20 వేల మంది భక్తులు తరలివచ్చినట్టు అంచనా.
Advertisement
Advertisement