► గులాబీ రంగు పురుగు దాడితో పత్తి విలవిల
► వర్షాల్లేక ఎండిపోతున్న వరి, సోయా, మొక్కజొన్న
► వారం పది రోజుల్లో వర్షాలు పడకుంటే పంట చేతికి రావడం కష్టమే
► క్రిడా, వ్యవసాయ శాఖ ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి పంటపై గులాబీ రంగు పురుగు దాడి చేస్తోందని, దీంతో తెల్లదోమ సోకే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తగు నివారణ చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించింది. రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ (క్రిడా), రాష్ట్ర వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారమిక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో 30 జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వివరాలను క్రిడా, వ్యవసాయ శాఖలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. పత్తిని గులాబీ రంగు పురుగు పట్టి పీడిస్తోందని సమావేశంలో వివిధ జిల్లాల వ్యవసాయాధికారులు తెలిపారు. ఇది మిగతా ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందన్నారు. వర్షాభావం వల్ల తెల్లదోమ కూడా ఆశించవచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. రానున్న వారం రోజుల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నందున రైతులకు తగు సూచనలు ఇవ్వాల్సిందిగా శాస్త్రవేత్తలు అధికారులకు సూచించారు. ముఖ్యంగా గులాబీ రంగు పురుగు నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పరిస్థితిపై అధికారులు నివేదిక సమర్పించారు.
ముందస్తు రబీకి వెళ్లడమే మంచిది!
రాష్ట్రంలో పంటలు ఆగమాగంగానే ఉన్నాయని జిల్లా అధికారులు ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయని తమ నివేదికలో పేర్కొన్నారు. పత్తి, సోయా, మొక్కజొన్న, వరి ఎండిపోతున్నాయని వివరించారు. వారం పది రోజుల్లో సరైన వర్షాలు పడకుంటే అవేవీ చేతికి రావని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొంత ప్రయోజనం కలిగించినా.. అవేవీ సరిపోవని చెప్పినట్లు సమాచారం. గులాబీ రంగు పురుగు, తెల్ల దోమలతో పత్తి అతలాకుతలం అవుతున్నట్లు పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఖరీఫ్ గట్టెక్కకుంటే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని శాస్త్రవేత్తలు సూచించినట్లు తెలిసింది. ఆ మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను తయారుచేసి వ్యవసాయశాఖకు అందజేశారు. ఈ నెలాఖరు వరకు సరైన వర్షాలు రాకుంటే ఖరీఫ్ పంటలు ఎండిపోయిన చోట ఆముదం, కంది పంటలు వేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. నెలాఖరు వరకు కూడా పత్తి పరిస్థితి మెరుగుకాకుంటే ముందస్తు రబీకి వెళ్లడమే మంచిదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఖరీఫ్ పంటలు ఎండిపోతే ముందస్తుగా సెప్టెంబర్ రెండో వారం నుంచే రబీ పంటలు సాగు చేయాలని సూచించారు. ఖరీఫ్ వరినాట్లు ఇంకా 44 శాతానికి మించలేదని, ఈ నెలాఖరు వరకు వేసే పరిస్థితి కూడా లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అందువల్ల ముందస్తు రబీకి వెళ్లడమే మంచిదని సూచించినట్లు తెలిసింది. కాగా కీలక సమావేశం సుదీర్ఘంగా జరిగినా అందులో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేదని సమాచారం. రైతులకు సమాచారం ఇవ్వాల్సిందిపోయి అత్యంత గోప్యంగా సమావేశాన్ని నిర్వహించి ముగించినట్లు విమర్శలు వచ్చాయి.
పంటలు ఆగమాగం
Published Wed, Aug 9 2017 2:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
తప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement