రూ. ఐదుకే భోజనం అభినందనీయం

Collector Dharma Reddy Priced Five Rupees Meals - Sakshi

మెదక్‌ ఏరియా ఆస్పత్రిలో ప్రారంభించిన కలెక్టర్‌ ధర్మారెడ్డి

తండ్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ధర్మకారి శ్రీనివాస్‌

అందరికీ ఆదర్శమన్న కలెక్టర్‌

మెదక్‌జోన్‌: రూ. 5కే అన్నం పెట్టడం అభినందనీయమని కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. గురువారం మెదక్‌ ఏరియా ఆస్పత్రి ఆవరణలో ధర్మాకారి రామచందర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో  ధర్మకారి(కటికె) శ్రీనివాస్‌ తన తండ్రి జ్ఞాపకార్థం ఏరియా ఆస్పత్రిలో రూ. 5 కే భోజనం అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరయ్యారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రూ. 5 కే బోజనం పెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రతి రోజు భోజన వసతి కల్పించేందుకుముందుకు వచ్చిన  శ్రీనివాస్‌ ఆదర్శవంతుడన్నాడు. ఎంతో మంది నిరుపేదలు ప్రతి రోజు ప్రభుత్వాస్పత్రికి వస్తుంటారని, వారికి ఈ వసతి కల్పించడం వల్ల నిరుపేదల ఆకలి తీరుతుందన్నారు.

తల్లిదండ్రులను పట్టించుకోని ఈ రోజుల్లో స్వర్గస్తులైన తన తండ్రి పేరుతో భోజన వసతి ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం నిర్వాహకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రతి రోజు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు.  స్వర్గస్తులైన తన తండ్రి పేరుతో ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తామన్నారు.  కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్‌రావు ఏరియా ఆసుపత్రి సూపరెంటెండెంట్‌ చంద్రశేఖర్, వైద్యులు నవీన్, శివదయాల్, బొజ్జ పవన్‌ తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top