
సాక్షి, రఘునాథపాలెం : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరంతండా రైతు బాదావత్ రామా(25) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రామా తన ఎకరన్నరతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిరప పంటలు సాగు చేయగా రూ.6 లక్షలకు పైగా అప్పులయ్యాయి. దీంతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.