'కార్మికులకు బోనస్‌లపై సీలింగ్ ఎత్తివేయాలి' | Sakshi
Sakshi News home page

'కార్మికులకు బోనస్‌లపై సీలింగ్ ఎత్తివేయాలి'

Published Mon, Aug 31 2015 8:03 AM

ceiling on bonus shouldbe removed, aituc leader sanjeeva reddy demands

కరీంనగర్: ఉద్యోగులకు సంస్థలు ఇచ్చే బోనస్‌లపై పరిమితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తివేయాలని ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి డిమాండ్ చేశారు.

ఆదివారం కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడేందుకు వీలుగా కంపెనీలకు సబ్సిడీలు ప్రకటించి, వాటి మనుగడకు తోడ్పడాలని కోరారు.

Advertisement
Advertisement