పిల్లల రక్షణను దృష్టిలో ఉంచుకునే సీసీ కెమెరాలు | CC Cameras in Schools Nizamabad | Sakshi
Sakshi News home page

పిల్లల రక్షణను దృష్టిలో ఉంచుకునే సీసీ కెమెరాలు

Nov 14 2018 12:43 PM | Updated on Nov 14 2018 12:43 PM

CC Cameras in Schools Nizamabad - Sakshi

పెదవాగు ప్రాజెక్ట్‌ ఆశ్రమ పాఠశాలలోని నిఘా కెమెరాల్లో నమోదైన దృశ్యాలు

సాక్షి, అశ్వారావుపేటరూరల్‌: ఆశ్రమ, గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం ‘నిఘా’ వేసింది. ఇక్కడి పిల్లల సంక్షేమం, రక్షణను దృష్టిలో ఉంచుకుని నిఘా నేత్రాలు(సీసీ కెమెరాలు) ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలల్లో విద్యార్థినీవిద్యార్థుల భద్రత, ఉద్యోగుల పనితీరును పరిశీలించేందుకు, ప్రభు త్వం అందిస్తున్న బియ్యం, ఇతర సామగ్రి పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ కెమెరాలు ఉపయోగపడతాయి. మండలంలోని సున్నంబట్టి, పెదవాగు ప్రాజెక్ట్, అనంతారం, కావడిగుండ్లతోపాటు అశ్వారావుపేటలోని గిరిజన బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేశారు.

ఒకొక్క పాఠశాలకు నాలుగు సీసీ కెమెరాలు, ఒ కొక్క కంప్యూటర్‌ చొప్పున ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను హైదారాబాద్‌లోగల కమిషనర్‌ కా ర్యాలయానికి అనుసంధానించారు. ఇక్కడ ఏం జ రుగుతోందో... హైదరాబాద్‌లోని ఉన్నతాధికా రు లు కూడా చూడొచ్చు. ఆయా పాఠశాలలు, గురుకుల పాఠశాలను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చే శా రు. దీనిపై తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement