సాయుధ దళాల గ్యాలెంట్రీ 

పురస్కారాల నగదు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: సాయుధ దళాల్లో పనిచేస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా ఉత్తమ ప్రతిభ కనబరిచి కేంద్ర ప్రభుత్వం గ్యాలెంట్రీ అవార్డులు అందుకున్న వారికి అందించే నగదు పురస్కారాన్ని పెంచుతూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. గ్యాలెంట్రీ అవార్డు, శౌర్య చక్ర, పరమ్‌వీర్‌ చక్ర పొందిన జవాన్లకు నగదు పురస్కారం పెంచు తామని ప్రకటించారు. దీనికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంబంధిత గ్యాలెంట్రీలకు నగదు పురస్కారం పెంచుతూ ఉత్తర్వులిచ్చింది.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత పురస్కారాలు అందుకున్న వారి కి కూడా ఇది అమలవుతుందని తెలిపింది. అలాగే ఒకేసారి వివిధ గ్యాలెంట్రీలు పొందిన వారికి ఆయా కేటగిరీల కింద పెంచిన పురస్కారం అమల వుతుందని వెల్లడించింది. తెలంగాణలో పుట్టి, స్థానికత ఉన్నవారికే ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. అవార్డు గ్రహీతలు రీజనల్‌/జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ కార్యాలయంలో అఫిడవిట్‌ దాఖలు చేసి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top