మళ్లీ విచారణకు వేం నరేందర్ రెడ్డి | Cash-for-vote case: ACB questions again vem narendar reddy | Sakshi
Sakshi News home page

మళ్లీ విచారణకు వేం నరేందర్ రెడ్డి

Jun 18 2015 1:09 PM | Updated on Aug 17 2018 12:56 PM

మళ్లీ విచారణకు వేం నరేందర్ రెడ్డి - Sakshi

మళ్లీ విచారణకు వేం నరేందర్ రెడ్డి

ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఓసారి విచారణకు హాజరైన టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి మరోసారి విచారణకు హాజరు కానున్నారు.

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఓసారి విచారణకు హాజరైన టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి మరోసారి విచారణకు హాజరు కానున్నారు. ఆయనను ఏసీబీ అధికారులు సోమవారం విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో టీడీపీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ బుధవారం సుమారు 6 గంటల పాటు విచారణ జరిపిన విషయం తెలిసిందే.

మరోవైపు ఆయన ఇవాళ ఉదయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏసీబీ విచారణ అంశాలను ఆయన ఈసందర్భంగా చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే కేసులో నోటీసులు అందుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య శుక్రవారం సాయంత్రంలోపు విచారణకు హాజరు కావల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement