ఘనంగా బతుకమ్మ పండుగ 

Bathukamma as grand festival - Sakshi

ఏర్పాట్లపై సీఎస్‌ జోషి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్‌లో జరగనున్న పండుగను రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా నిర్వహించేందుకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సీఎస్‌ ఎస్‌.కె.జోషి మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బతుకమ్మ పండగ అక్టోబర్‌ 9న ప్రారంభమవుతుందని, 17న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, పీపుల్స్‌ప్లాజాలో పండగ వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పండగను విశ్వవ్యాప్తం చేసేందుకు అధికారుల కమిటీ సూచనలు అందించాలని, వీటి ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top