మోదీ నిర్ణయాన్ని స్వాగతించాలి: దత్తాత్రేయ | bandaru dattatreya welcomes Modi's Demonetisation | Sakshi
Sakshi News home page

‘మోదీ నిర్ణయాన్ని స్వాగతించాలి’

Dec 24 2016 8:11 PM | Updated on Apr 3 2019 5:16 PM

మోదీ నిర్ణయాన్ని స్వాగతించాలి: దత్తాత్రేయ - Sakshi

మోదీ నిర్ణయాన్ని స్వాగతించాలి: దత్తాత్రేయ

నల్లధనాన్ని వెలికితీయాలన్న నిర్ణయంతో ప్రధాని పెద్దనోట్లు రద్దు చేశారని బండారు దత్తాత్రేయ అన్నారు.

హైదరాబాద్‌:  దేశంలో దాగిఉన్న నల్లధనాన్ని వెలికితీయాలన్న నిర్ణయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పెద్దనోట్ల రద్దు కార్యక్రమాన్ని ప్రతి వ్యక్తి స్వాగతించాలని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. ఎప్సీఆర్ హిల్స్‌లోని ఓంనగర్ బస్తీలో స్థానిక బీజేపీ నేతలు నోట్ల రద్దు, డిజిటల్ లావాదేవీలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. దేశంలో వేలకోట్లలో నల్లధనం దాగి ఉందన్న విషయాన్ని గ్రహించిన ప్రధాని మోదీ దానిని వెలికితీయాలనే ఉద్దేశ్యంతో పెద్దనోట్ల రద్దు కార్యక్రమాన్ని సాహసోపేతంగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement