విద్యాశాఖ మంత్రి తెలుసా? | B Janardhan Reddy Visited Adarsha School In Elkathurthy | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ మంత్రి తెలుసా?

Dec 22 2019 2:19 AM | Updated on Dec 22 2019 2:19 AM

B Janardhan Reddy Visited Adarsha School In Elkathurthy - Sakshi

ఎల్కతుర్తి: వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తిలోని ఆదర్శ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్‌రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నైపుణ్యాలను ఆరా తీసే క్రమంలో పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పేరు ఏమిటని అడగగా విద్యార్థుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇక విద్యార్థి రాజు పాఠశాలకు రాలేదని తెలుసుకున్న జనార్ధన్‌రెడ్డి ఆయన తండ్రికి ఫోన్‌ చేసి వివరాలపై ఆరా తీశారు. పిల్లలకు పనులు చెప్పకుండా రోజూ బడికి పంపించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement