మన పథకాలు దేశానికే ఆదర్శం
తెలంగాణ భవన్ ఆర్సీ అశోక్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఆర్సీ) అశోక్ కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆయన భవన్లో జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.