హైకోర్టులో అగ్రిగోల్డ్‌ ఆస్తుల కేసు విచారణ.. | agrigold assests case inquiry in high court | Sakshi
Sakshi News home page

హైకోర్టులో అగ్రిగోల్డ్‌ ఆస్తుల కేసు విచారణ..

Dec 12 2017 7:25 PM | Updated on Aug 31 2018 8:34 PM

సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ ఒకప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట.. ఈ సంస్థల్లో ప్రజలు రూ. లక్షల్లో డిపాజిట్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ సంస్థ  డిపాజిట్‌ దారులకు నగదు చెల్లించకుండా చేతులెత్తిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం  హైకోర్డులో అగ్రిగోల్డ్‌ ఆస్తుల కేసు విచారణ జరుగుతోంది.  అగ్రిగోల్​ ఆస్తుల పూర్తి వివరాలు ఇంకా మాకు అందలేదని జీఎస్‌ఎల్‌ గ్రూప్‌ హైకోర్డుకు తెలిపింది. అంతేకాక మూడు నెలల సమయం కావాలని జీఎస్‌ఎల్‌ గ్రూప్‌ కోర్టును కోరింది. 

దీనిపై స్పందించిన హైకోర్టు అగ్రిగోల్డ్‌ ఆస్తుల వివరాలు తెలుసుకోనేందుకు ఆ సంస్థకు జనవరి 18 వరకూ సమయం ఇచ్చింది.  ఆలోపు 70 శాతం ఆస్తుల వివరాలు ఇవ్వాలని సంస్థకు హైకోర్టు సూచించింది. పిటిషనర్‌ మాట్లాడుతూ.. రూ. వెయ్యికోట్లు డిపాజిట్‌​ చేసేలా ఆ సంస్థను ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను హైకోర్టు జనవరి 18కి వాయిదా వేసింది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement