సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఒకప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట.. ఈ సంస్థల్లో ప్రజలు రూ. లక్షల్లో డిపాజిట్ చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ డిపాజిట్ దారులకు నగదు చెల్లించకుండా చేతులెత్తిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైకోర్డులో అగ్రిగోల్డ్ ఆస్తుల కేసు విచారణ జరుగుతోంది. అగ్రిగోల్ ఆస్తుల పూర్తి వివరాలు ఇంకా మాకు అందలేదని జీఎస్ఎల్ గ్రూప్ హైకోర్డుకు తెలిపింది. అంతేకాక మూడు నెలల సమయం కావాలని జీఎస్ఎల్ గ్రూప్ కోర్టును కోరింది.
దీనిపై స్పందించిన హైకోర్టు అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలు తెలుసుకోనేందుకు ఆ సంస్థకు జనవరి 18 వరకూ సమయం ఇచ్చింది. ఆలోపు 70 శాతం ఆస్తుల వివరాలు ఇవ్వాలని సంస్థకు హైకోర్టు సూచించింది. పిటిషనర్ మాట్లాడుతూ.. రూ. వెయ్యికోట్లు డిపాజిట్ చేసేలా ఆ సంస్థను ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను హైకోర్టు జనవరి 18కి వాయిదా వేసింది.