* పునఃప్రారంభమైన ‘మీనా ప్రపంచం’
* నెలరోజులు ఆలస్యంగా అందిన షెడ్యూల్
* పాఠాలను నష్టపోయిన విద్యార్థులు
* ఇప్పటికీ మూలనే ఉన్న ‘రేడియో’లు
నాగిరెడ్డిపేట : ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ రేడియోలు పాఠాలు చెబుతున్నాయి. ఇటీవలే మళ్లీ మీనా ప్రపంచం ప్రారంభమయ్యింది. కాగా సమాచార లోపం కారణంగా విద్యార్థులు నెలరోజులు పాఠాలు నష్టపోవాల్సి వచ్చింది. అభ్యాసం అనేది మొదట వినడంతోనే ప్రారంభమవుతుంది. దృశ్యం కంటే శబ్ధానికే త్వరగా స్పందించడం సర్వసాధారణమైన విషయం.
దీనిని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం ‘మీనా ప్రపంచం’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో రేడియో పాఠాలను ప్రవేశపెట్టింది. ప్రాథమిక దశలో శ్రవణ మాద్యమం ద్వారా పాఠాలను బోధించి, చిన్నారులను చదువుకు చేరువ చేయాలనేది లక్ష్యం. అయితే రాష్ట్రవిభజన నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో రేడియోలు మూగబోయాయి. ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వం రేడియో పాఠాలను అందించేందుకు నిర్ణయం తీసుకుంది.
‘మన ప్రపంచం.. మీనా ప్రపంచం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు రేడియో ద్వారా పాఠాలను బోధించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు రేడియోలో రోజువారీగా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలతో కూడిన షెడ్యూల్ను రూపొందించారు. ఆ షెడ్యూల్ను అనుసరిస్తూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఆయా తరగతుల విద్యార్థులకు రేడియో పాఠాలను వినిపించాల్సి ఉంటుంది.
సమాచార లోపంతో..
అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని కిందిస్థాయికి చేరవేయడంతో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారు. డిసెంబర్ ఒకటో తేదీనుంచి ప్రారంభమైన కార్యక్రమానికి సంబంధించిన వివరాలు నాగిరెడ్డిపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డిసెంబర్ 31న అందాయి. రేడియో పాఠాలకు సంబంధించిన వాల్పోస్టర్లు, కరదీపిక పుస్తకాలు, రోజువారీ కార్యక్రమ షెడ్యూల్ నెల ఆలస్యంగా అందాయి. దీంతో విద్యార్థులు నెల రోజుల పాఠాలను నష్టపోవాల్సి వచ్చింది.
పర్యవేక్షణ కరువు
పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘మన ప్రపంచం.. మీనా ప్రపంచం’ కార్యక్రమం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. పాఠశాలల తనిఖీకి వెళ్లే అధికారులు ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పట్టికలు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రిజిష్టర్లు పరిశీలిస్తున్నారే తప్ప రేడియో పాఠాలకు సంబంధించిన రిజిష్టర్ గురించి ఆరా తీసిన దాఖలాలు లేవు.
దీంతో ఉపాధ్యాయులు సైతం ఈ కార్యక్రమం అమలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కాగా చాలా పాఠశాలల్లో మూలనపడిన రేడియోల దుమ్మును ఇప్పటికీ దులపలేదని తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి రేడియో పాఠాల నిర్వహణపై పర్యవేక్షణ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
మళ్లీ.. ‘విందాం, నేర్చుకుందాం’
Published Mon, Jan 19 2015 4:23 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వరికోత మిషన్ను తరలిస్తున్న డీసీఎం బోల్తా
కారు, బైక్ ఢీ.. భర్త మృతి
ఒకదానికొకటి ఢీకొన్న మూడు కార్లు
దేవుడి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్
మట్టి తరలిస్తున్న వారిపై కేసు
అధిక వడ్డీ ఆశచూపి మోసం
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
ఓటేసి వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
24న కృషి విజ్ఞాన కేంద్రంలో వరి విత్తన మేళా
తప్పక చదవండి
- బిల్ కలెక్టర్ రాసలీలలు
- ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- సందీప్ లమిచానే శిక్ష రద్దు.. వరల్డ్కప్ జట్టులో చోటు?
- పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు
- అందుకే ఓడిపోయాం!.. వరుస వైఫల్యాలు.. ఇకనైనా: సంజూ
- సన్నీ లియోన్ బర్త్డేను ఎందుకు జరుపుకున్నారో చెప్పిన యువకులు
- Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
- ‘హలో అప్పారావ్.. ఏంటి పరిస్థితి!’
Advertisement