భర్త వైద్యం కోసం.. పసికందును అమ్మేసిన వైనం
ఓదెల(పెద్దపల్లి): ఓ వైపు చచ్చుబడిన కాళ్లతో మంచాన పడ్డ భర్త.. మరోవైపు ఆకలితో అల మటిస్తున్న ముగ్గురు పిల్లలకు బువ్వ పెట్టలేని దైన్యం.. చివరకు భర్తకు వైద్యం చేయించేందుకు, ఆకలితో కడుపు మాడుతున్న పసి హృదయాల గోస చూడలేక పేగుబంధాన్ని మరిచి ఆరు నెలల పసిగుడ్డును అమ్మేసింది. పదిరోజుల తర్వాత కొడుకుపై మమ కారం చావక బాబును ఇప్పిం చాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది ఓ మాతృమూర్తి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లె తండాకు చెందిన గుగులోతు తేజ, కవిత దంపతులకు ముగ్గురు సంతానం.
మహేశ్(5), కుమార్తె మహదేవి (3), బాబు (6 నెలలు) ఉన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని గిరిజన కుటుంబం. చిన్న ఇల్లు తప్ప ఆస్తి పాస్తులు లేవు. భార్యాభర్తలిద్దరూ రోజూ కూలీలు. ఆరునెలల క్రితం తేజ వెన్నెముకకు టీబీ వ్యాధి సోకి రెండు కాళ్లు చచ్చుబడిపో యాయి. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వెన్నెముకకు ఆపరేషన్ చేయించినా ఫలితం లేకపోయింది. తేజ పూర్తిగా మంచానికే పరి మితమయ్యాడు.దీంతో రోజు కూలికి వెళ్లే కవిత భర్తకు సపర్యలు చేస్తూ ఇంటివద్దే ఉంటుండగా పూట గడవడం కష్టంగా మారింది. మరోవైపు పిల్లలను సాకలేని పరిస్థితి. కవిత తన భర్త కాళ్లను బాగు చేసుకుని కుటుంబాన్ని చక్కదిద్దు కోవాలనుకుంది.
గత నెల 31న అదే గ్రామానికి చెందిన సంతానం లేని సింగరేణి కార్మికుడికి తన చిన్న కుమారున్ని మధ్యవర్తి ద్వారా లక్ష రూపాయలకు అమ్మేసింది. వారు గోదావరి ఖనిలో నివాసముంటున్నారు. స్థానికంగా దత్తత తీసుకున్నట్టు ప్రచారం చేశారు. కవిత బిడ్డను అమ్మగా వచ్చిన డబ్బుల్లోంచి రూ.60 వేలను కుమార్తె పేరిట డిపాజిట్ చేసింది. మిగతా రూ.40 వేలను భర్త కోసం, కుటుంబఖర్చుల కోసం వెచ్చించింది. వారం నుంచి చిన్న కుమారుడిపై మమకారం చావక ముభావంగా ఉంటోంది.
కొడుకుపై ప్రేమను చంపుకోలేక బిడ్డను ఇప్పించాలంటూ మధ్య వర్తిని ఆశ్రయించింది. కాళ్లావేళ్లా పడి బతిమి లాడింది. చివరకు ఇచ్చిన రూ.లక్ష వాపసు తీసుకొచ్చి ఇస్తే బిడ్డను ఇచ్చేస్తామని వారు చెప్పారు. దీంతో చేతిలో చిల్లిగవ్వలేక మూడు రోజుల క్రితం ఇంటినుంచి బయటకు వెళ్లింది. పొత్కపల్లి పోలీస్స్టేషన్లో శనివారం తన బాబును ఇప్పించాలని ఫిర్యాదు చేసింది. బాబును అమ్మించిన మధ్యవర్తిని పిలిపించి మాట్లాడుతున్నట్టు ఎస్సై రమేశ్ తెలిపారు. కాగా, భర్త వైద్యం కోసం కన్న కొడుకునే అమ్మడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఓ తల్లి కథ..!
Published Sun, Apr 9 2017 3:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement