హన్మకొండ, న్యూస్లైన్ : ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి ఏకంగా 606 మంది అధికారులు డుమ్మా కొట్టారంటే విధులపై వారికి ఉన్న గౌరవం ఎంతటిదో ఇట్టే అర్థమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 2234 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ స్టేష న్లో ఒక్కో ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ను నియమించారు.
ఈ మేరకు విధులు వేస్తున్నట్లు నియామక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మొత్తం 4468 మంది ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లతోపాటు 10 శాతం మందికి అదనంగా విధులు కేటాయించారు. మొత్తం 4920 మంది అధికారులకు స్థానిక సంస్థల ఎన్నికలకు విధులు కేటాయించారు.
ఎన్నికల విధుల జాబితాపై నిర్లక్ష్యమా?
జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో 27, 28వ తేదీల్లో వీరికి మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఆయా సెగ్మెంట్ల లో మొత్తం 606 మంది ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు వీరి జాబితా ను తీసుకున్నారు. కాగా, డీఈఓ కార్యాలయం నుంచి పంపించిన జాబితా అస్పష్టంగా ఉన్నట్లు వెల్లడైంది. కొంతమంది వివరాలు సరిగా లేవని, దీంతో వారికి సమాచారమే అందలేని గుర్తిం చారు.
ఇదిలా ఉంటే పదో తరగతి పరీక్షల విధులు కేటాయించడంతో ఒక్కొక్కరికి రెండేసి విధులు పడ్డాయని, దీంతో వివరాలు లోపించాయంటూ డీఈఓ కార్యాలయం అధికారులు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఎన్నికల విధులకు సంబంధించిన జాబితాను ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా డీఈఓకు సంజాయిషీ నోటీసు జారీ చేయాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జెడ్పీ సీఈఓ నుంచి ఈ నోటీసు వెలువడక ముందే డీఈఓ కార్యాలయం నుంచి హడావుడిగా మరో జాబితాను పంపించారు.
ఎందుకు రాలేదంటే..
ప్రస్తుతం ఒకేసారి మూడు ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో ఇప్పటికే సిబ్బంది పూర్తి జాబితాను సిద్ధం చేసి నివేదించామని, వారిలో కొంతమంది ఎన్నికల విధులను తేలిగ్గా తీసుకున్నారంటూ ఈసీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసీ నుంచి 606 మందికి నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న వారు వారం రోజుల్లోనే సంజాయిషీ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఈ నోటీసులు జారీ అయిన వారిలో 400 మంది విద్యాశాఖకు చెందిన వారు ఉండగా, 206 మందిలో ఇతర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఉన్నారు.
శిక్షణకు 606 మంది డుమ్మా
Published Mon, Mar 31 2014 3:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement