పంచాయతీకి పన్ను చెల్లించలేదంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామ పంచాయతీ అధికారులు 12 దుకాణాలకు తాళాలు వేశారు.
శంషాబాద్: పంచాయతీకి పన్ను చెల్లించలేదంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామ పంచాయతీ అధికారులు 12 దుకాణాలకు తాళాలు వేశారు. గురువారం ఉదయం ఈ మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మూతపడిన వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శంషాబాద్ శాఖతోపాటు వినూత్న హోండాషోరూం కూడా ఉన్నాయి. పన్ను బకాయిలు చెల్లించాలంటూ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆయా సంస్థలు స్పందించలేదని అధికారులు తెలిపారు.