గణేష్ శోభాయాత్రలో అపశ్రుతి | young man died with current shock over ganesh immersion | Sakshi
Sakshi News home page

గణేష్ శోభాయాత్రలో అపశ్రుతి

Sep 17 2016 12:13 PM | Updated on Aug 1 2018 2:31 PM

వినాయక శోభాయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.

-యువకుడి మృతి
జిన్నారం: వినాయక శోభాయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. మెదక్‌ జిల్లా జిన్నారం మండలం గుమ్మడిదలలో శనివారం ఉదయం బొజ్జ గణపతిని ఊరేగిస్తున్న వాహనానికి విద్యుత్ తీగలు తాకాయి. దీంతో ఆ సమయంలో వాహనం పై ఉన్న కిషోర్(19) కరెంట్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కిషోర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement