దేశ రాజధానిలో అగ్నిప్రమాదం | Three dead, 10 injured in fire in Delhi | Sakshi
Sakshi News home page

దేశ రాజధానిలో అగ్నిప్రమాదం

Nov 2 2016 9:10 AM | Updated on Sep 5 2018 9:47 PM

ఢిల్లీలో షహదర ప్రాంతంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షహదర ప్రాంతంలో మోహన్ పార్క్ వద్ద బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించగా, మరో పదిమంది గాయపడ్డారు. వాహనాలు, ఇతర వస్తువులు కాలిపోయాయి.

ఓ భవంతిలో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉన్నట్టు అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన భవంతిలో నివసిస్తున్నవారిని కాపాడినట్టు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement