బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన వ్యక్తి దుండగుల చేతిలో కిడ్నాప్కు గురయ్యాడు
కోరుట్ల(సిరిసిల్ల రాజన్న): బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన సిరిసిల్ల జిల్లా వాసి గుర్తు తెలియని దుండగుల చేతిలో కిడ్నాప్కు గురయ్యాడు. వివరాలివీ.. ఇబ్రహీంపట్నం మండలం కొజాన్కొత్తూర్ గ్రామానికి చెందిన బి.రవి ఉపాధి కోసం కొంతకాలం క్రితం ఇరాక్ దేశానికి వెళ్లాడు. అతడుండే ప్రాంతంలో అంతర్యుద్ధం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో కొందరు గుర్తు తెలియని దుండగులు రెండు రోజుల క్రితం రవిని ఎత్తుకుపోయారు. ఈ విషయాన్ని తోటి వారు కుటుంబసభ్యులకు ఫోన్లో తెలిపారు. ప్రస్తుతం రవి పొరుగునే ఉన్న టర్కీ దేశంలో ఉన్నట్లు చెబుతున్నారని వారు పేర్కొన్నారు. అతడి క్షేమ సమాచారాలు పూర్తిగా తెలియకపోవటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.