ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల ఖర్చులో విఫలం | tdp leader slams trs government | Sakshi
Sakshi News home page

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల ఖర్చులో విఫలం

Apr 14 2017 1:22 PM | Updated on Aug 17 2018 8:11 PM

అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వల్ల ఏర్పడ్డ ప్రభుత్వాలు చట్టాలను తుంగలో తొక్కుతున్నాయని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌: అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వల్ల ఏర్పడ్డ ప్రభుత్వాలు చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిందిపోయి.. వాటిని తుంగలో తొక్కుతున్నాయని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లు వచ్చే కార్యక్రమాల కోసం బడ్జెట్‌ నిధులు ఖర్చు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను సరిగ్గా ఖర్చు పెట్టడంలో విఫలమైంది. మంత్రివర్గ కూర్పులో దళితులు, మహిళలకు చోటు ఇవ్వనేలేదు.. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని మోసం చేశారన్నారు. యాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement