రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయండి | Supreme Court order to mattayya | Sakshi
Sakshi News home page

రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయండి

Jan 17 2017 3:23 AM | Updated on Sep 2 2018 5:28 PM

ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేయాలని జెరుసలెం మత్తయ్యను

ఓటుకు కోట్లు కేసులో మత్తయ్యకు సుప్రీంకోర్టు ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేయాలని జెరుసలెం మత్తయ్యను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఈ కేసు విచారణ నుంచి మత్తయ్య పేరును తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.

Advertisement
 
Advertisement
Advertisement