టీనగర్: మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో సన్ టీవీ నిర్వాహకుడిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అన్నానగర్ ఈస్ట్ బుజుల్లా గార్డెన్ అపార్టుమెంటుకు చెందిన ప్రవీణ్ (51). ఈయన సన్టీవీలో నెట్వర్క్ అధికారి. ముంబైకి చెందిన దీపి శివన్ (38) సూర్య టీవీలో ప్రోగ్రామ్ అధికారి. తరువాత ప్రవీణ్ విధుల నుంచి రిలీవ్ అయి ముంబై వెళ్లారు. దీప్తిశివన్ నాలుగు నెలల క్రితం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేశారు. అందులో తనకు రావాల్సిన వేతన బకాయిలు 36లక్షలు ఇవ్వకుండా మోసగిస్తున్నారని, తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు సంబంధిత పోలీస్స్టేషన్ లో చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కొద్ది రోజుల క్రితం దీపిశివన్ చెన్నై సెంట్రల్ క్రైంబ్రాంచ్లో మళ్లీ ఒక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వెంటనే విచారణ జరపాలని పోలీసు కమిషనర్ జార్జ్ ఉత్తర్వులు ఇచ్చారు. సెంట్రల్ క్రైంబ్రాంచ్ అడిషినల్ కమిషనర్ ఆధ్వర్యంలో డెప్యూటీ కమిషనర్ జయకుమార్ ఆధ్వర్యంలో అడిషినల్ కమిషనర్ శ్యామల దీని గురించి విచారణ జరిపారు. విచారణ తరువాత గురువారం రాత్రి అన్నానగర్ ఇంటిలో ఉన్న ప్రవీణ్ను సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈయన్ను కోర్టులో హాజరు పరచి జైలుకు తరలించారు.
సన్ టీవీ నిర్వాహకుడి అరెస్ట్
Published Sat, Dec 27 2014 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement