ఆమ్నేస్టీ సంస్థపై రాజద్రోహం కేసు | Sedition Case Against Amnesty India After Slogan-Shouting At Kashmir Debate | Sakshi
Sakshi News home page

ఆమ్నేస్టీ సంస్థపై రాజద్రోహం కేసు

Aug 16 2016 12:42 PM | Updated on Sep 4 2017 9:31 AM

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ (ఆమ్నేస్టీ)పై కర్ణాటకలో రాజద్రోహం కేసు నమోదు అయింది.

బెంగళూరు:  అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ (ఆమ్నేస్టీ)పై కర్ణాటకలో రాజద్రోహం కేసు నమోదు అయింది.  కశ్మీర్లో మానవ హక్కులపై అమ్నేస్టీ సంస్థ శనివారం బెంగళూరులో సదస్సు నిర్వహించింది.  ఈ సదస్సులో కశ్మీరీలు ఆజాదీ నినాదాలు చేశారు. దీంతో అమ్నేస్టీ సదస్సు జాతి వ్యతిరేకమంటూ ఏబీవీపీ ఫిర్యాదు చేసింది. దేశానికి వ్యతిరేకంగా కొందరు ప్రసంగాలు చేశారని ఏబీవీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అమ్నెస్టీ సంస్థతో పాటు మరికొందరిపై కర్ణాటక పోలీసులు సోమవారం రాజద్రోహం కేసు నమోదు చేశారు. కాగా తమకు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ అందలేదని ఆమ్నేస్టీ కర్ణాటక విభాగం తెలిపింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement