ఆర్‌ఎం కార్యాలయం ఎదుట ధర్నా | rtc retired employees protest in regional office in ongole | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎం కార్యాలయం ఎదుట ధర్నా

Sep 20 2016 10:56 AM | Updated on Sep 4 2017 2:16 PM

ఆర్టీసీ రీజినల్‌ కార్యాలయం ఎదుట రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.

ఒంగోలు : ఆర్టీసీ రీజినల్‌ కార్యాలయం ఎదుట రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిప్రసాదరావు మాట్లాడుతూ 2013 ఏప్రిల్‌ ఒకటి నుంచి తాజాగా రిటైరైన ఆర్టీసీ కార్మికులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ బకాయీలు రూ.100 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. రిటైరై నలభై నెలలు దాటినా బకాయిలు అందుకోలేక జీవనోపాధికి సైతం రిటైర్డ్‌ కార్మికులు దినదినగండంగా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందక, మరోవైపు వృద్ధాప్యంలో అవి అందుకోకుండా పలువురు మరణించారన్నారు. ఈ నేపథ్యంలో వృద్ధుల పట్ల కనికరం చూపుతూ తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా 3 ఏళ్లుగా ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్‌ కూడా నిలిచిపోయిందని, దీని వల్ల ప్రతి ఉద్యోగికి ఇప్పటి వరకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు బకాయీలు పేరుకుపోయాయన్నారు.

ఆర్టీసీ ఆస్పత్రుల్లో కూడా అవసరమైన మందులు ఉండడం లేదని, ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చినా మందులు అందుబాటులో ఉంచకపోవడం దారుణమన్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించని పక్షంలో అక్టోబర్‌ 5వ తేదీన విజయవాడలోని ఆర్టీసీ ఎండీ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఛలో విజయవాడ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులు తరలి రావాలని హరిప్రసాదరావు హెచ్చరించారు. ధర్నాలో రీజనల్‌ అధ్యక్ష, కార్యదర్శులు కోటా నాగేశ్వరరావు, ఎస్‌.పోలేరయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.ఇన్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీకే మూర్తి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement