ఏపీలో పంటలకు మద‍్దతు ధర ఏదీ? | raghuveera reddy demands support price for crops | Sakshi
Sakshi News home page

ఏపీలో పంటలకు మద‍్దతు ధర ఏదీ?

May 9 2017 11:45 AM | Updated on Aug 18 2018 5:57 PM

రాష్ట్రంలో ఏ పంటకూ మద్దతు ధర లేదని ఏపీసీసీ అధ‍్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.

గుంటూరు: రాష్ట్రంలో ఏ పంటకూ మద్దతు ధర లేదని ఏపీసీసీ అధ‍్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం స్థానికంగా ఉన్న మిర్చి మార్కెట్ యార్డును రఘువీరారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ‍్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు.
 
చంద్రబాబు ఇచ్చిన ధరల స్థిరీకరణ నిధి హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. 90 లక్షల క్వింటాళ్ల మిర్చి ఉండగా 2 శాతం కూడా కొనుగోలు కాలేదని  అన్నారు. కోల్డ్‌ స్టోరేజీల్లో దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని, జిల్లాల్లో మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement