నేడు చెన్నైకు ప్రధాని మోదీ | PM narendramodi to pay tribute to Jayalalithaa | Sakshi
Sakshi News home page

నేడు చెన్నైకు ప్రధాని మోదీ

Dec 6 2016 8:54 AM | Updated on Aug 15 2018 6:34 PM

ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైకు వెళ్లి జయలలితకు నివాళులు అర్పించనున్నారు.

చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైకు వెళ్లి జయలలితకు నివాళులు అర్పించనున్నారు. ఈ రోజు 9:30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి చెన్నై చేరుకుంటారు. రాజాజీ పబ్లిక్‌ హాల్‌లో ఉంచిన జయలలిత పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పిస్తారు. ఎఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రులు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు.. జయలలిత అంత్యక్రియల్లో పాల్గొంటారు.

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి జయలలిత మరణించిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం మెరీనా బీచ్‌లో గురువు ఎంజీఆర్ సమాధి పక్కన జయ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement