సాక్షి, బళ్లారి : పది సంవత్సరాలుగా యూపీఏ ప్రభుత్వం భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో పూర్తిగా విఫలమైందని నరేంద్ర మోడీ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని బళ్లారి లోక్సభ బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములు అన్నారు. ఆయన గురువారం నగరంలోని కౌల్బజార్లోని టైలర్ వీధి, జవారి వీధి, దానప్ప కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఆయా కాలనీల్లో కలియ తిరుగుతూ బీజేపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు.
ఎన్నికల సమయంలో ప్రజలు ముందుకు వచ్చే నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. హిందూ-ముస్లింల మధ్య భేదభావం సృష్టించి కాంగ్రెస్ పార్టీ ఓట్లు పొందాలని చూస్తోందన్నారు. ముస్లింల సంక్షేమం కోసం నరేంద్రమోడీ కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. కులమతాలకతీతంగా యావత్ భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఏకైక నాయకుడు నమో అని గుర్తు చేశారు.
వచ్చే నెల 17వ తేదీన జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ మూడు ముక్కలు కావడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఈ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు ఏకం కావడంతో కాంగ్రెస్ ఆటలు సాగవన్నారు. కేజేపీ, బీఎస్ఆర్సీపీలు బీజేపీలోకి విలీనం కావడంతో రాష్ట్రంలోనే మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందుతారన్నారు.
తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకు వచ్చి బళ్లారిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గోవిందరాజులు, బీజేపీ నాయకుడు గురులింగనగౌడ తదితరులు పాల్గొన్నారు.
‘నరేంద్ర మోడీతోనే దేశాభివృద్ధి సాధ్యం’
Published Fri, Mar 28 2014 3:41 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement