ఇంటర్మీడియెట్ గణితం ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యం కోసం జవాబు పత్రాలను పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
పెరిగిన ఇంటర్ గణితం జవాబు పత్రాలు
Oct 5 2016 11:39 AM | Updated on Sep 4 2017 4:17 PM
మంచిర్యాల సిటీ : తెలంగాణ రాష్ట్రంలో 2016-17 విద్యాసంవత్సరం మార్చిలో నిర్వహించే ఇంటర్మీడియెట్ గణితం ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యం కోసం జవాబు పత్రాలను పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. గత విద్యాసంవత్సరం వరకు విద్యార్థులకు జవాబు పత్రాలను 23 పేజీలతో కూడిన బుక్లెట్ ఇచ్చేవారు. అవి విద్యార్థులకు అసౌకర్యవంతంగా ఉండడంతో ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో స్పందించిన బోర్డు ఉన్నతాధికారులు 27 పేజీలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
Advertisement