గణేశ్ నిమజ్జనం, బక్రీద్ నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పుకార్లు నమ్మొద్దు: సీపీ మహేందర్ రెడ్డి
Sep 12 2016 4:10 PM | Updated on Aug 21 2018 7:18 PM
- నగరంలో భారీ భద్రత
- ప్రశాంతంగా పండుగ జరుపుకోండి
- పలు ప్రాంతాల్లో పోలీసుల కవాతు
హైదరాబాద్: ఓ వైపు గణేశ్ నిమజ్జనం, బక్రీద్ నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పుకార్లు నమ్మకుండా ప్రజలందరూ ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని పోలీసులు సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. అల్లర్లకు అవకాశం లేకుండా సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు. ముందుజాగ్రత్తగా నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి నగరంలో పర్యటిస్తున్నారు. పోలీసుల బందోబస్తును సీపీ పర్యవేక్షిస్తున్నారు. ప్రజలందరూ ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని సూచించారు. పుకార్లు నమ్మవద్దని, సోషల్ మీడియాలో, ఇతర మాధ్యామాల ద్వారా పుకార్లుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Advertisement
Advertisement