ఈవీఎంలకు భారీ భద్రత | heavy security for EVMs | Sakshi
Sakshi News home page

ఈవీఎంలకు భారీ భద్రత

Apr 10 2014 11:02 PM | Updated on Jul 11 2019 8:26 PM

రాజధానిలో లోక్‌సభ ఎన్నికల పర్వంలో కీలక ఘట్టం ముగిసింది. ఏడు లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ పూర్తయింది.

సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో లోక్‌సభ ఎన్నికల పర్వంలో కీలక ఘట్టం ముగిసింది. ఏడు లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ పూర్తయింది. ఓట్ల లెక్కింపు మే 16న జరగనున్నందున దాదాపు 36 రోజులపాటు ఈవీఎంలకు భారీ భద్రత కల్పించనున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి తరలించిన ఈవీఎంలకు పారామిలటరీ బలగాలు కాపలా కాస్తాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.    
 
అన్ని లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ఎంపికచేశామని, ఏ లోక్‌సభ సీటుకు సంబంధించిన ఓటింగ్ యంత్రాలను ఆ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు జరిపే పోలింగ్ కేంద్రంలో పటిష్టమైన  భద్రతతో భద్రపరుస్తామని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఢిల్లీ పోలీసులతోపాటుకేంద్ర పారామిలిటరీ బలగాల భద్రతలో ఓటింగ్ యంత్రాలనుంచుతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement