తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు.
అమ్మవారి సేవలో పలువురు ప్రముఖులు
Jan 7 2017 3:48 PM | Updated on Sep 5 2017 12:41 AM
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. వీరిలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్రెడ్డి, ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి ఉన్నారు. కుటుంబ సమేతంగా వీరు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Advertisement
Advertisement