కారు బోల్తా: ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు | Four injured in road accident, Car turns over one killed | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు

Aug 27 2016 9:38 AM | Updated on Aug 28 2018 5:48 PM

భారత్ బెంజ్ షోరూమ్ వద్ద శనివారం ఉదయం వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది.

కోవూరు(నెల్లూరు జిల్లా): నెల్లూరు జిల్లా కోవూరు శివారులోని జాతీయ రహదారిలో ఉన్న భారత్ బెంజ్ షోరూమ్ వద్ద శనివారం ఉదయం వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో ప్రకాశం జిల్లా సోదరగుట్ట మండలం రామాపురం గ్రామానికి చెందిన ఎద్దు ఏడుకొండలు అక్కడికక్కడే మృతిచెందగా, ఆయన తండ్రి చెన్నయ్య, భార్య అంకమ్మ, వారి పిల్లలు శ్రీనివాసులు, లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు.

వీరందరూ శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కోవూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడుకొండలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement