ఓ భవనం పై ఏర్పాటు చేసిన సెల్ఫోన్ టవర్లో అగ్నిప్రమాదం సంభవించింది.
సెల్టవర్లో అగ్నిప్రమాదం
Oct 24 2016 4:12 PM | Updated on Sep 5 2018 9:47 PM
రాజమండ్రి: ఓ భవనం పై ఏర్పాటు చేసిన సెల్ఫోన్ టవర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ భవనం పై ఉన్న ఐడియా, ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీల సంయుక్త టవర్ వద్ద ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచరం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే టవర్ పూర్తిగా కాలి బూడిదైంది.
Advertisement
Advertisement