పలమనేరులో ఏనుగుల బీభత్సం | elephants attack on fields | Sakshi
Sakshi News home page

పలమనేరులో ఏనుగుల బీభత్సం

Sep 28 2016 10:46 AM | Updated on Oct 2 2018 6:42 PM

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేట కోటూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేట కోటూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగు పంట పొలాలను నాశనం చేసింది. వరి, రాగి, బీన్స్ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమీపంలోని రామసముద్రం నుంచి ఏనుగు వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ఏనుగుల దాడిపై గ్రామస్థులు అటవీ శాఖ అధికారలకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement