'రూ. 20 వేల కోట్ల నిధులు లాప్స్‌' | congress leader jeevan reddy slams trs government | Sakshi
Sakshi News home page

'రూ. 20 వేల కోట్ల నిధులు లాప్స్‌'

Feb 10 2017 3:34 PM | Updated on Sep 5 2017 3:23 AM

'రూ. 20 వేల కోట్ల నిధులు లాప్స్‌'

'రూ. 20 వేల కోట్ల నిధులు లాప్స్‌'

ఆర్‌ఎస్‌ పాలనలో ఇప్పటివరకు రూ. 20 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు వృధా అయ్యాయని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పాలనలో ఇప్పటివరకు రూ. 20 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు వృధా అయ్యాయని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. రానున్న బడ్జెట్ లో వృధా అయిన నిధులను ప్రత్యేక నిధుల కింద కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే బడ్జెట్ లో ఎస్సీలకు 15.5 శాతం, ఎస్టీలకు 10 శాతం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని కోరారు.
 
బడ్జెట్ ను కేటాయింపులకు పరిమితం చేయకుండా ప్రతి మూడు నెలలకోసారి విడుదల చేసి ఖర్చుచేయాలన్నారు. దీన్ని అమలు చేయకపోతే సీఎం కేసీఆర్‌ చీటింగ్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. బడ్జెట్లో సబ్ ప్లాన్ కు కేటాయించిన నిధులను క్వాటర్లీ వారీగా విడుదల చేయకుండా ఏడాది చివర్లో విడుదల చేసి అవి ఖర్చు కాలేదని ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement