సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ వివరాలను ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
'గంటసేపు ఏం మాట్లాడుకున్నారో చెప్పండి'
Apr 25 2017 4:19 PM | Updated on Aug 15 2018 2:32 PM
కామారెడ్డి: తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ వివరాలను ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ..ముస్లిం రిజర్వేషన్లపై మోడీ ఏం మాట్లాడారో బహిరంగంగా ప్రకటించాలన్నారు. గంట సేపు ఏం మాట్లాడుకున్నారో చెప్పాలన్నారు. వారిద్దరూ మాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా కాంగ్రెస్స్ పార్టీ సిద్దంగా ఉంటుందని తెలిపారు.
Advertisement
Advertisement