డూండీ గణేష్ ఉత్సవాలకు రాజకీయ రంగు | cm chandrababu and lokesh photos in vijayawada dundi ganesh area | Sakshi
Sakshi News home page

డూండీ గణేష్ ఉత్సవాలకు రాజకీయ రంగు

Sep 6 2016 2:31 PM | Updated on Aug 29 2018 3:37 PM

బెజవాడలో డూండీ గణేష్ ఉత్సవాలకు టీడీపీ నేతల అత్యుత్సాహంతో రాజకీయ రంగు పులుముకుంది.

విజయవాడ : బెజవాడలో డూండీ గణేష్ ఉత్సవాలకు టీడీపీ నేతల అత్యుత్సాహంతో రాజకీయ రంగు పులుముకుంది. ఘంటసాల సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు.

దీంతో తెలుగు తమ్ముళ్లు ప్రచార్భాటానికి తెర లేపారు. కళాశాల ప్రాంగణమంతా సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఫొటోలను ఏర్పాటు చేశారు. దీంతో ఆధ్యాత్మిక కార్యక్రమం కాస్త పచ్చపార్టీ ఉత్సవంగా మారింది. టీడీపీ నేతల తీరుపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement