సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ | cell Tower boarded up Suicide | Sakshi
Sakshi News home page

సెల్ టవర్ ఎక్కి హల్‌చల్

Nov 15 2013 3:46 AM | Updated on Nov 6 2018 7:53 PM

ఆత్మహత్య చేసుకుంటానంటూ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి హల్‌చ ల్ సృష్టించిన సంఘటన గురువారం టీనగర్ చోటుచేసుకుంది.

సాక్షి, చెన్నై: ఆత్మహత్య చేసుకుంటానంటూ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి హల్‌చ ల్ సృష్టించిన సంఘటన గురువారం టీనగర్ చోటుచేసుకుంది. దండపాణి వీధిలోని ఎయిర్‌టెల్ టవర్ పైకి ఎక్కిన వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు కేకలు పెట్టాడు. దీంతో అక్కడ జనం గుమిగూడి దూకొద్దం టూ సినీమా ఫక్కీలో కాసేపు విన్నవించుకున్నారు. సమాచారం అందుకున్న టీనగర్ అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకుని 45 నిమిషాలు శ్రమించారు. ఆ వ్యక్తిని బుజ్జగించేందుకు నానాతంటాలు పడ్డారు. చివరకు సాహసం చేసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని టీనగర్ పోలీసులకు అప్పగించారు. విచారణలో అతడి పేరు  కార్తీక్(38) అని తేలింది. ఆ టవర్‌కు కూత వేటు దూరంలో ఉన్న ప్రముఖ ట్రావెల్స్‌లో కార్తీక్ పని చేస్తున్నట్టు, అక్కడ ఏర్పడ్డ తగాదా, ఇబ్బందులతో టవర్ ఎక్కినట్టు తేలింది. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు సంబంధిత ట్రావెల్స్‌లో విచారిస్తున్నారు. ఈ ఆత్మహత్య హైడ్రామా పుణ్యమా అంటూ ఆ మార్గంలో కాసేపు ట్రాఫిక్ తంటాలు తప్పలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement