ఆర్టీసీ బస్సులో మంటలు.. మహిళ మృతి | bus catches fire in karnataka | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో మంటలు.. మహిళ మృతి

Feb 21 2017 8:41 AM | Updated on Sep 5 2018 9:47 PM

ఆర్టీసీ బస్సులో ఒక‍్కసారిగా మంటలు చెలరేగి ఒక మహిళ మృతిచెందింది

బెంగుళూరు: కర్ణాటక ఆర్టీసీ బస్సులో మంగళవారం వేకువజామున ఒక‍్కసారిగా మంటలు చెలరేగి ఒక మహిళ మృతిచెందింది. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు.

చిక్‌మగళూరు నుంచి బెంగుళూరుకు వెళ్తున్న బస్సులో ఒక‍్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో డ్రైవర్‌ బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులు బస్సులో నుంచి బయటపడే సమయంలో ఓ మహిళకు మంటలంటుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు పూర్తిగా దగ్ధమైంది, సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement