అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ ఉత్సవాల్లో భాగంగా శనివారం నాగార్జున సాగర్ కు బౌద్ధ మతస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
సాగర్లో బౌద్ధ మతస్థుల సందడి
Feb 25 2017 2:50 PM | Updated on Oct 19 2018 7:19 PM
నాగార్జునసాగర్: అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ ఉత్సవాల్లో భాగంగా శనివారం నాగార్జున సాగర్ కు బౌద్ధ మతస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 17 దేశాలకు చెందిన ముప్పై మంది బౌద్ధ బిక్ష్యవులు ఈరోజు సాగర్ను సందర్శించారు. స్థానిక బుద్ధభవనం, నాగార్జున కొండను సందర్శించుకొని తన్మయత్వానికి గురయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పర్యాటక కార్యక్రమాలను కొనియాడారు.
Advertisement
Advertisement