ఎయిమ్స్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఈ నెల 12వ తేదీన సమీక్ష జరగనుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ ఆధ్వర్యంలో జరిగే
న్యూఢిల్లీ: ఎయిమ్స్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఈ నెల 12వ తేదీన సమీక్ష జరగనుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో పదవీ విరమణ వయసును 65 నుంచి 70కి పెంపు అంశంపై సమీక్ష జరుగుతుందని ఎయిమ్స్ వైద్యాధికారి ఒకరు శనివారం మీడియాకు తెలియజేశారు. కాగా ఎయిమ్స్ పరిపాలనా వ్యవహారాల్లో సుస్థిరతతోపాటు అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఈ పెంపు దోహదపడుతుందని కొందరు వైద్యులు అంటుండగా, ురికొందరు దీనిని అక్రమమంటూ మరికొందరు ఖండించారు. సీనియర్ ఉద్యోగులను కొనసాగిస్తే కొత్తగా ఉద్యోగాల కోసం వచ్చే యువత పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.