ప్రసాదం తిని 150 మందికి అస్వస్థత | 150-people-including-children-fall-ill-on-consuming-sweets-at-a-religious-fair-in-pune | Sakshi
Sakshi News home page

ప్రసాదం తిని 150 మందికి అస్వస్థత

Feb 11 2017 3:04 PM | Updated on Sep 5 2017 3:28 AM

ఓ ఉత్సవంలో పంపిణీ చేసిన స్వీట్లు తిని సుమారు 150 మంది అస్వస్థతకు గురయ్యారు.

పూణే: ఓ ఉత్సవంలో పంపిణీ చేసిన స్వీట్లు తిని సుమారు 150 మంది అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్ర పూణే జిల్లా మావల్‌ తహశీల్‌ పరిధిలోని పచానే గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో జరిగిన ఓ ఉర్సు ఉత్సవంలో ప్రసాదంగా లడ్డూను పంపిణీ చేశారు. అది తిన్న వారంతా వాంతులు, విరేచనాలతో తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులతో గ్రామంలోనే శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు వైద్య చికిత్సలు అందిస్తున్నామని మావల్‌ తహశీల్‌ ఆరోగ్య అధికారి చంద్రకాంత్‌ లొహారే తెలిపారు.
 
అయితే, బాధితుల్లో చాలా మందిని వైద్య చికిత్సల అనంతరం ఇళ్లకు పంపించేశామని.. ఇంకా, 50 మంది వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. కాగా, ఈ ఘటనపై విచారణ చేపట్టామని, ఉత్సవం సందర్భంగా పంపిణీ చేసిన స్వీట్లు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయిస్తున్నామని వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement