మూడు రోజుల్లో 12 మంది విదర్భ రైతుల ఆత్మహత్య | 12 farmers' suicide in Vidarbha | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో 12 మంది విదర్భ రైతుల ఆత్మహత్య

Dec 28 2014 10:40 PM | Updated on Sep 29 2018 7:10 PM

విదర్భ ప్రాంతంలో గత 72 గంటల్లో 12 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆదివారం..

నాగపూర్ : విదర్భ ప్రాంతంలో గత 72 గంటల్లో 12 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆదివారం విదర్భ జన్ ఆందోళన్ సమితి అధినేత కిషోర్ తివారి తెలిపారు. వీరందరూ పత్తిని ఎక్కువగా పండించే పశ్చిమ విదర్భ ప్రాంతానికి చెందినవారేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కరువు  వల్ల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని, దాంతో చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక రైతులు ఆత్మహత్యను ఆశ్రయిస్తున్నారని తివారి ఆవేదన వ్యక్తం చేశారు. పత్తిరైతుకు  మద్దతు ధరను పెంచేందుకు ప్రభుత్వం కృషిచేయాలని ఆయన  విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement