కలుషిత నీరు తాగి వంద మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
100 మంది విద్యార్థినులకు అస్వస్థత
Sep 9 2016 11:59 AM | Updated on Nov 9 2018 4:44 PM
తిరుపతి: కలుషిత నీరు తాగి వంద మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల బాలికల వసతి గృహంలో కలుషిత నీరు తాగి శుక్రవారం 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని రుయా, స్విమ్స్, కేంద్రీయ ఆస్పత్రులకు తరలించారు. కాగా నలుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Advertisement
Advertisement